గాయపడిన రాష్ట్రం.. గాడిన పెట్టేది మీరే.. పవన్‌ గురించి చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..??

Suma Kallamadi
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, బీజేపీ లీడర్ మోదీ కలిసి ఈసారి వైసీపీ అధినేత జగన్ పై పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి ముగ్గురు కలిసి వచ్చినా వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది రివర్స్ అయ్యింది. కట్ చేస్తే కలలో కూడా ఎమ్మెల్యేగా గెలవలేరు, అధికారంలోకి రాలేరు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 100% సక్సెస్ తో ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఎదిగారు. పోటీ చేసిన 21 సీట్లలో ఆయన విజయం సాధించారు. రెండు ఎంపీ సీట్లలో కూడా విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయం చూసి పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషించారు. అంతేకాదు, తాజాగా చాలా ఎమోషనల్ గా తన తమ్ముడికి అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు కూడా విషెస్ చెప్పారు.


“డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !! నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే.. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరు.


అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చిరు విషెస్ చెబుతూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. “ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి, చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: