గెలుపు ఖాయం కాగానే చంద్రబాబుతో ప్రముఖ డైరెక్టర్ మీటింగ్??

Suma Kallamadi
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్స్‌లోనే టీడీపీ కూటమి పూర్తిగా హవా చూపించింది. అప్పటిదాకా వైసీపీ తెలుస్తుందని లేకపోతే రెండు పార్టీలు హోరాహోరీగా తలపడతాయని అందరూ భావించారు కానీ వార్‌ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. దెబ్బకు జగన్ 20 కంటే తక్కువ సీట్లకు పడిపోయారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని బాగా తొక్కేశారు. టికెట్ల రేట్లు పెంచకుండా వాటిపై రూల్స్ తెచ్చారు. షూటింగ్స్, టికెట్ల రేట్లు, సినిమాలకు సంబంధించి అనేక విషయాల్లో జోక్యం చేసుకున్నారు వాటిపై కొత్త రూల్స్ తెచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు వంటి ప్రముఖ హీరోలు కూడా జగన్ తో భేటీ అయ్యి ఈ విషయాలపై మాట్లాడారు.
 కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో వారు నిరాశ పడ్డారు జగన్ ఓడిపోవాలని సినిమా ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఉన్న టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సినిమా ఇండస్ట్రీ పై ఉన్న ఆంక్షలు అని తొలగిపోతాయని భావించారు. అయితే వారి కోరికలే చివరికి నెరవేరాయి. పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుతో కలిసి అధికారంలోకి రాబోతున్నారు. బాబు సీఎం గా ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి అయింది. ఈ నేపథ్యంలో చాలామంది సినిమా సెలబ్రిటీ వాళ్లు చంద్రబాబుకు కంగ్రాట్యులేషన్స్ చెప్పడానికి వెళ్తున్నారు.
తాజాగా లెజెండ్, సింహ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రముఖ తెలుగు దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబును కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. ఆయన కారులో చంద్రబాబును మీట్ కావడానికి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయపాటి శ్రీను టీడీపీకి ఎప్పుడూ సపోర్టు చేస్తూనే ఉంటారు. ఇక చంద్రబాబు పార్టీలో అత్యంత కీలకమైన నందమూరి బాలకృష్ణకు, బోయపాటి శ్రీనుకు మధ్య అనుబంధం ఉంది. కంగ్రాట్యులేషన్స్ చెప్పి సినిమాల గురించి చంద్రబాబుతో బోయపాటి శ్రీనుతో మాట్లాడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: