పిఠాపురంలో ఏమైనా జ‌ర‌గొచ్చు.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో ఏముందంటే..?

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం.. హీటెక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలో మెజారిటీ సంస్థ‌లు... జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటార‌ని తేల్చి చెప్పాయి. అదేస‌మ‌యంలో మెజారిటీ విష‌యంలోనూ కొన్ని సంస్థ లు అంచ‌నాలు వెలువ‌రించాయి. దీని ప్ర‌కారం.. ప‌వ‌న్ ల‌క్ష మెజారిటీ ద‌క్కించుకుంటార‌ని కేకే స‌ర్వే చెప్ప‌గా.. మ‌రికొన్ని స‌ర్వేలు.. 70 వేల వ‌ర‌కు మెజారిటీ ఖాయ‌మ‌న్నారు.

గెలుపు మాత్రం ప‌వ‌న్ ప‌క్కాగా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని పేర్కొన్నారు. అయితే.. ఇదే జ‌రిగితే క‌నుక‌.. ఇక్క‌డ ప‌రిస్థితి చేయిదాటే ప్ర‌మాదం ఉంద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెబుతున్న‌ట్టు తెలిసింది. ఈ మేర కు తాజాగా స‌ర్కారుకు నివేదిక అందించిన‌ట్టు స‌మాచారం. ఇద్ద‌రూ కూడా.. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఇక్క‌డ  నుంచి బ‌రిలో నిలిచారు. దీంతో పోటీ చాలా వ‌ర‌కు తీవ్రంగా న‌డిచింది. ఎన్నిక‌ల‌న్నాక‌.. గెలుపుఒక‌రి ప‌క్ష‌మే వ‌స్తుంది.. కానీ, ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

దీంతో ప‌వ‌న్ గెలుస్తున్న‌ట్టు అంచ‌నాలు రావ‌డం తో.. ఇక్క‌డ పెద్ద ఎత్తున అల‌జ‌డి రేగే అవ‌కాశం ఉంద ని ... జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు, టీడీపీ నాయ‌కుల ఇళ్ల‌పైనా దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు.. ఈ నేప‌థ్యంలో పిఠాపురంలో పెద్ద ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించాల్సి ఉంద‌ని.. పోలింగ్ ఫలితాలు వెల్ల‌డ‌య్యే రోజు ఖ‌చ్చితంగా ఏదైనా జర‌గొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  ముఖ్యంగా సీమ‌కు చెంది న ఓ జిల్లా కార్య‌క‌ర్త‌లు ఇక్క‌డ మ‌కాం వేసిన‌ట్టు అంచ‌నా వేశారు.

వీరిని త‌క్ష‌ణ‌మే పిఠాపురం నుంచి పంపించేయాల‌ని  కూడా... ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు సూచించాయ‌ని తెలి సింది. అలాగే.. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద మ‌రింత సంఖ్య‌లో భద్ర‌త‌ను ఏర్పాటు చేయాల‌ని... రెచ్చ‌గొట్టుకు నేలా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుల‌ను ముందుగానే హెచ్చ‌రించి.. అవ‌స‌రం అయితే.. హౌస్ అరెస్టు చేయాల ని కూడాసూచించారు. మొత్తంగా పిఠాపురంపై ఎగ్జిట్‌పోల్ వ‌చ్చిన త‌ర్వాత‌... మ‌రింత అల‌జ‌డి రేగ‌డం గ‌మ‌నార్హం. మ‌రి కౌంటింగ్ రోజు ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: