ఏపీ: ఓటింగ్ పెరగడానికి ప్రధాన కారణం డబ్బేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారని విషయం పైన సర్వేలు సైతం , విశ్లేషకులు సైతం సరైన విజయాన్ని ఎవరు గెలుస్తారనే విషయం పైన తేల్చలేకపోతున్నారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ పైన ఆధారపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతవరకు నిజమనే విషయాన్ని కూడా సరిగ్గా కన్ఫామ్ చేయలేవని వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పుడు తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు నాగేశ్వరరావు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు ఉన్న ఎక్కువ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఓటింగ్ ఎక్కువ పర్సెంటేజ్ పడే అవకాశం ఉంటుంది. 2014తో పోలిస్తే.. 2019లో దేశంలోని ఓటింగ్ పెరిగింది. మోడీ ఓడిపోలేదు గెలిచారు.. 2014తో పోలిస్తే 2019లో ఓటింగ్ భారీగా పెరిగినప్పటికీ మోదీని గెలిచారు.. ఏదైనా ఒక బలమైన కోరిక ఉంటేనే ప్రజలు ఓటింగ్ ఎక్కువగా వేస్తారని సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. డబ్బులు ఎక్కువగా పంచుతున్నారు కనుక ఓటింగ్ వేయడానికి వస్తున్నారని తెలిపారు.

లోపలి పై ఏ బటన్ నొక్కుతారో తెలియదు కానీ ఓటింగ్ వేయడానికి అయితే ఎక్కువ మందే వస్తున్నారని తెలిపారు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా డబ్బులు పంపిస్తున్నాయి డబ్బులు తీసుకొని మరి ఓటు వేయకపోతే అన్ని పార్టీల వారు గోల చేస్తారు.. అందువల్లే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్న దానికి ఇది కూడా కారణమని తెలిపారు. మూడు పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఓటు వేయకుండా ఇంట్లో ఉంటే.. కచ్చితంగా అందరూ అడుగుతారు కనుక ఓటింగ్ పెరిగిన తగ్గిన ఎవరు గెలుస్తారని విషయాన్ని అంచనా వేయలేము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ పెరిగితే ఒక పార్టీకి లాభం పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ పెరిగితే మరో పార్టీకి లాభం ఉంటుందంటూ తెలిపారు. పట్టణ ప్రాంతాలలో వైసిపి పార్టీకి వ్యతిరేకత ఉంది అక్కడ కూడా ఎక్కువ పడితే ఖచ్చితంగా నష్టం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ పెరిగితే వైసీపీకి లాభం ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: