మోదీ ధ్యానంలో ఏం ఆహారం తీసుకుంటారో తెలుసా..?

Pulgam Srinivas
బీ జే పీ పార్టీ నేత మరియు ప్రస్తుతం భారత దేశ అయినటువంటి మోదీ తాజాగా 45 గంటల ధ్యానం ను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళనాడు లోని కన్యాకుమారి లో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోదీ నిన్న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు ఈ ధ్యానం ను మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం ఈ ధ్యానం విజయవంతంగా కొనసాగుతోంది. ఇక మోడీ 45 గంటల పాటు చేయనున్న ఈ ధ్యానం గురించి జనాలకు అనేక విషయాలు తెలుసుకోవాలి అని ఉంది.

ఆయన ఈ ధ్యానం లో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు. అసలు ఆహారాన్ని తీసుకుంటారా ..? లేక అలాగే ధ్యానం చేస్తూ ఉంటారా ..? ఇలా అనేక ప్రశ్నలు జనాలలో ఉన్నాయి. ఇకపోతే ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం లో కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు అని ఓ జాతీయ మీడియా తాజాగా కథనాలను వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం మోదీ ఈ 45 గంటల ధ్యానం సమయంలో కొబ్బరి నీళ్లు , ద్రాక్ష రసం స్వీకరిస్తారని తెలిపారు. ఇక మౌనంగా ఉంటూ మెడిటేషన్ హాల్ నుండి బయటకు రారు అని కూడా జాతీయ మీడియా పేర్కొంది.

ఇక మోడీ చేస్తున్న ఈ ధ్యానం కు ఎంతో మంది పూర్తి మద్దతు తెలిపారు. ఇకపోతే రేపు తుది దశ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటితో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇందుకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన విడుదల కానుంది. ఇందులో గనుక మరోసారి బీ జే పీ దేశంలో అధికారం లోకి వచ్చేంత సంపూర్ణ మెజారిటీని దక్కించుకున్నట్లు అయితే మరోసారి మోడీ ప్రధాని అవుతాడు. మరి 3 వ సారి మోడీ ప్రధాని అవుతాడా ..? లేదా అనేది జూన్ 4 వ తేదీన క్లియర్ గా తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: