ఏపీ:జగన్ కాన్ఫిడెంట్.. బాబూ ఓవర్ కాన్ఫిడెంట్..?

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13వ తేదీన పూర్తి అయ్యాయి.. ఇలా ఓటి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. చంద్రబాబు, జగన్ ఇద్దరు అధినేతలు కూడా అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు.. జగన్ వాస్తవంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కసరత్తులు చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఇలా వీరందరూ కూర్చొని ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ జరిగింది.. ఎక్కడెక్కడ తేడా జరిగిందనే విషయం గురించి చర్చించుకొని తెలియజేస్తారని.. అయితే అలా వారి వారి అంచనాల ప్రకారం చర్చించుకున్న తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం పైన ఒక అవగాహన వచ్చేస్తుందనీ టిడిపి నేతలు కార్యకర్తలు భావించారు.


కానీ ఎన్నికలు అయిపోగానే ఎవరి దారిన వారు హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. పురందేశ్వరి అసలు పట్టించుకోలేదు.. అక్కడితో ఆగిపోయింది. జగనేమో మూడు రోజులపాటు కూర్చొని.. చాలా కసరత్తులు చేసిన తర్వాత తను మాత్రమే మాట్లాడాను అన్న విషయం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ కనీసం చెబుతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ బూతులో జరిగిన పర్సెంటేజ్ తో సహా ఆలా లెక్కేసి మరి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ,ఎస్టీ నియోజవర్గాలలో  89 -94 % వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు.

అదే సందర్భంలో ఓసీలు ఎక్కువగా ఉండేటువంటి పోలింగ్ బూతులలో 78-85% శాతం వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. అలా కులాల వారిగా మహిళలు ఎంత మంది ఆ మహిళల్లో మనకు వేశారు.. వెయ్యకపోవచ్చు అని.. అలా ఎంతమంది ఓసి వాళ్ళు ఉన్నారు బిసి ,ఎస్సి, ఎస్టీ అలాంటి లెక్కలన్నీ చెక్ చేసుకున్న తర్వాతే జగన్ కి వచ్చినటువంటి కాన్ఫిడెంట్ తోనే మాట్లాడినట్లుగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. మరి ఇది ఎంత మటుకు వాస్తవం అనే విషయం తెలియాల్సి ఉంది.. కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా కేవలం టిడిపి నేతలు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి దారిన వారు చూసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: