నరసరావుపేట: బుల్లెట్ల వర్షం కురిపించిన పోలీసులు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సజావుగా సాగాలని ఈసి అందుకు తగ్గట్టుగా బలగాలను ఏర్పరచుకొని చాలా కట్టుదిట్టమైన పరిస్థితులలో ఓటింగ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో గొడవలు, కొట్టుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పోలింగ్ కేంద్రం వద్దకు కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల పైన రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద రావడానికి వీలు లేదంటూ కూడా వైసిపి వర్గీయులు సైతం వాదన చేశారు. అయితే తనకు వచ్చే హక్కు ఉందని తెలియజేశారు.

అయినప్పటికీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంటూనే ఉంది. అలా అటు వైసిపి టిడిపి కాన్వాయ్ పైన  రాళ్ల దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొకసారి తాజాగా అక్కడ ఉద్రిత్తత తీవ్రంగా చోటుచేసుకుంది. వైసిపి అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపైకి టిడిపి వర్గీయులు రాళ్ల దాడి చేయడంతో టిడిపి కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు సైతం విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తత అవ్వడంతో అక్కడ కార్యకర్తల పైన రబ్బరు బుల్లెట్లను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది.

అయితే మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది.కానీ ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రమైన స్థాయికి వెళుతూనే ఉన్నాయి... ఇప్పటికే తాడిపత్రి ,అనంతపురం, హిందూపురం, గన్నవరం ఇతరత్న ప్రాంతాలలో కూడా చాలా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దీంతో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో కార్యకర్తలు నాయకులు సైతం చెల్లాచెదురుగా వెళ్లిపోయారు.. ప్రస్తుతం అక్కడ పెన్షన్ వాతావరణ నెలకొనడంతో ఓటర్లు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రమంతట సజావుగా సాగాలని ఈసీ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమంది నేతల వల్ల ఓటర్లు సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంతో మంది బలగాలను కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చినప్పటికీ కూడా ఇలాంటివి ఎక్కువగానే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: