టీడీపీకి కష్టపడి సొంత పార్టీనే ముంచేసిన పవన్?

Purushottham Vinay
పవన్ కళ్యాణ్  టీడీపీకి కష్టపడి సొంత పార్టీ జనసేననే నట్టేట ముంచేశారు. జనసేన సభలు కంటే కూటమి సభల్లోనే ఎక్కువగా పాల్గొని నరాలు తెగిపోయేలా ఎన్నో ఉత్తేజ భరితమైన ప్రసంగాలు చేశాడు. ఆయన పర్యటనలు, ప్రసంగాలు ప్రతి చోటా టీడీపీకి అనుకూలంగా ఉత్సాహభరితంగా సాగాయి. పవన్‌ కల్యాణ్‌ ఎప్పటిలాగే తన స్టైల్ లో పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతూ ప్లే చేసిన సింపతీనే మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడి ప్రసంగాలు చేశారు. ఒంటరిగా పోటీ చేస్తున్న జగన్‌ మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ చేసిన వ్యక్తిగత సవాళ్లు కాంట్రవర్సీ క్రియేట్ చేసినా కూడా అవి తన సొంత పార్టీ జనసేనకు ఏమాత్రం ఉపయోగపడలేదు.పవన్ జగన్ ని ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారాలు గమనిస్తే అర్ధం అవుతుంది. జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలి.. జగన్‌ను ఓడించకపోతే.. తన పేరు పవన్‌ కల్యాణే కాదు.. తన  పార్టీ జనసేనే కాదు అంటూ పవన్‌ కళ్యాణ్ నరాలు తెగి ఊగిపోతూ చేసిన ప్రసంగాలు టీడీపీకి ప్లస్ అయ్యాయే తప్ప అయన సొంత పార్టీకి ఏమాత్రం ఉపయోగపడలేదు.


పవన్ కళ్యాణ్ ఒక పక్క తాను పోటీ చేస్తున్న పిఠాపురంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ మరో వైపు ఇతర ప్రాంతాల్లో కూడా కష్టపడి ప్రచారాలు చేస్తూ పర్యటించారు. ముఖ్యంగా టీడీపీ కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పవన్ హాజరవ్వడం తన సొంత పార్టీ జనసేనకి మైనస్ అయ్యింది. కేవలం టీడీపీకే కాదు. బీజేపీకి కూడా పవన్ కష్టపడ్డాడు.మోడీ, అమిత్‌ షా హాజరైన సభలకు కూడా పవన్‌  కల్యాణ్ హాజరయ్యాడు.ప్రచారాల్లో పవన్ చేసిన ప్రసంగాలు వందకి వెయ్యి శాతం టీడీపీకి ఉపయోగపడ్డాయే తప్ప జనసేనకి ఏమాత్రం యూజ్ అవ్వలేదు. నిజానికి పవన్ టీడీపీ కోసం పడ్డ కష్టానికి జనసేనకి వచ్చిన సీట్లు చాలా తక్కువ. ఆయన ప్రచారాలు టీడీపీకి బాగా ఉపయోగపడ్డాయే తప్ప తన సొంత పార్టీకి సొంత వాళ్లకు మాత్రం ఉపయోగపడలేదు. పైగా ఆయన తీరు సొంత పార్టీకి మైనస్ అయ్యింది. పార్టీ కోసం కష్టపడ్డ సొంత అభ్యర్థులకు వారి కష్టానికి తగ్గ ఫలితం లేక పార్టీ నుంచి తొలగిపోవడం జనసేనకి బిగ్ మైనస్. తన కోసం కష్టపడ్డ వారు, తనని నమ్ముకున్న వారి విషయంలో పవన్ అట్టర్ ఫెయిల్ అయ్యి సొంత పార్టీనే ముంచేసిన లీడర్ అయ్యాడు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: