తిరుపతి: పాత శత్రువులు.. కొడుకు కోసం కొత్త పోరాటం.. గెలుపెవరిది..?

Divya
గడిచిన కొన్నేళ్ల అజ్ఞాతం నుంచి బయటకి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయంగా చురుకుగా పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈసారి బరిలో దిగబోతున్నారు.. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2009 ఎన్నికలలో సొంతంగా జై సమైక్యాంధ్ర అనే ఒక పార్టీని కూడా ఏర్పాటు చేశారు.. పీలేరు నుంచి పోటీ చేయగా అక్కడ 56,636 ఓట్లను మాత్రమే సాధించారు అయితే ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్లీ కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది.


దీంతో మళ్లీ గత ఏడాది బిజెపి పార్టీలోకి చేరి.. 2024 ఎన్నికలలో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బిజెపి పోటీ చేయబోతున్నారు.. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. నల్లారి కుటుంబంతో చింతల కుటుంబం మధ్య ఆధిపత్య పోరు జరగబోతుందని తెలుస్తోంది. ఆ జిల్లాలలో చక్రం తిప్పేటువంటి వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పట్టు ఉంది.. దీంతో అక్కడ నల్లారి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా పరిస్థితి మారిపోయింది.


ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న సమాచారం మేరకు.. కాంగ్రెస్ పార్టీలో 1989 నుంచి 2024 వరకు ఎన్నో రాజకీయ పదవులను సైతం kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తన బలాన్ని మరింత పెంచుకున్నారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కిషోర్ టిడిపిలోకి చేరడంతో ఈ విషయం తన అన్నకు సయించలేదు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపికి పెద్దగా ప్రాధాన్యత లేదు అనుకుంటున్న సమయంలో జనసేన,  టిడిపి కూటమి కావడం వల్ల రాజంపేట నియోజకవర్గంలో నల్లారి కుమార్ రెడ్డి కూటమి పై ఆశలు పెట్టుకున్నారు.


రాజంపేటలో టిడిపికి కాస్త బలం ఉందని చెప్పవచ్చు.. రైల్వే కోడూరులో టిడిపి కోటలో జనసేన అభ్యర్థి పేరు తెరమీదికి వచ్చింది.. అక్కడ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికే గుర్తింపు ఉన్నది. అలాగే రాయచోటి నుంచి టిడిపి అభ్యర్థి మండిపల్లి ప్రసాద్ రెడ్డి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి సహకారం అందవచ్చు... జై సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టినప్పుడు కూడా రాంప్రసాద్ రెడ్డి కీలకంగా ఉండేవారట. తంబాలపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్కడ వైసిపి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు.. దీంతో అక్కడ టిడిపి ఇబ్బంది పడుతోంది. మదనపల్లి కూడా వైసిపికి అనుకూలంగానే ఉంది. పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని దింపారు. అక్కడ నల్లారి కుటుంబానికి మంచి సానుభూతి ఉంది. ఇక పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఒక కంచుకోటగా ఉన్నది.

మొత్తం మీద రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి అభ్యర్థులే గత ఎన్నికలలో గెలిచారు.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి పెద్దిరెడ్డికి ఉన్న వైరం ఇప్పటిది కాదు.. అలాంటిది కుమారుడిపై పోటీ చేస్తున్న నల్లారిని ఓడించడానికి పెద్దిరెడ్డి ఏమైనా చేయడానికి సిద్ధం అని చెప్పక తప్పట్లేదు.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొదటిసారి 2014లో పురందేశ్వరి పై విజయం సాధించారు.. కానీ  2019 ఎన్నికల్లో డిఏ సత్యప్రభ మెజారిటీ పెంచుకున్నారు..అందుకే  ఈసారి కిరణ్ వీరికి ఎలాంటి పోటీ ఇస్తారు అన్నది ఉత్కంఠ బరితంగా మారింది.. మొత్తానికి అయితే ఈ పాత శత్రువులు మళ్లీ పోరాటంలోకి దిగబోతున్నారు.. మరి గెలుపు ఎవరిదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: