ఏపీ : షో టైమ్ సర్వే.. జగన్ ఎన్ని సీట్లు గెలుస్తాడంటే.. షర్మిల గురించి కూడా చెప్పేసారుగా?

praveen
ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు మాత్రమే కాదు.. ఎన్నికల సర్వేలు కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఇలాంటి సర్వేలు కొన్ని నిజం అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకోవడం.. ఇక తమ పార్టీకి అనుకూలంగానే సర్వే రిపోర్టులు  వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో చెప్పుకోవడం జరుగుతూ వస్తుంది.

 దీంతో ఒకప్పటిలాగా ఇప్పుడు సర్వే రిపోర్టులను గుడ్డిగా నమ్మలేకపోతున్నారు జనాలు. అయితే ఆంధ్ర రాజకీయాలు వాడి వేడిగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సర్వేలు ఎన్నో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే షో టైం అనే సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టులను ఇటీవలే వైసిపి వెల్లడించింది. అయితే ఈ సర్వే ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో.. వైసిపి గెలుస్తుందట. ఇక ఈ సర్వే రిపోర్ట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 షో టైం సంస్థ ఎన్నికల సర్వే ప్రకారం.. టిడిపి, జనసేన పొత్తుగా ముందుకు సాగిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 115 ఇక టిడిపి జనసేన లకు కలిపి 53 నుంచి 54 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇతరులకు ఒక సీటు వస్తుందని సర్వే రిపోర్ట్ చెబుతుంది. అయితే ఇక ఇప్పుడు బిజెపి జనసేనతో పాటు పొత్తులోకి అటు బిజెపి కూడా వచ్చి చేరింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఉన్న పరిస్థితుల దృశ్య.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 133 నుంచి 146 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని.. ఇక ఎన్డీఏ కూటమికి 25 నుంచి 28 సీట్లు.. ఇక ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఇతరులకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఉంది ఈ సర్వే చెబుతూ ఉండడం గమనార్హం. అయితే వైసిపి వాళ్లే ఈ సర్వే చేయించి ఉంటారని అందుకే వారికి అనుకూలంగా ఉంది అంటూ టిడిపి శ్రేణులు ఈ సర్వే పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: