నారా లోకేష్ పైన విరుచుకుపడ్డ..ఆళ్ల రామకృష్ణ..!!

Divya
సీఎం జగన్ కులం మత రాజకీయాలు పార్టీలు చూడకుండానే పలు రకాల సంక్షేమ పథకాలు అందించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ వెల్లడించారు. లబ్ధి చేకూరిన వారందరూ తమకు ఓటు వేయాలని అడిగే ధైర్యం కేవలం ఒక జగన్ కి మాత్రమే ఉందని జగన్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇంటింటికి చేరాయని కూడా వెల్లడించారు. నారా లోకేష్ ఎన్నో మాయమాటలతో డబ్బు సంచులతో మాత్రమే మన ముందుకు వస్తున్నారని ఆ మాయ మాటలను ఎవరు నమ్మొద్దు అంటూ సూచిస్తున్నారు. నారా లోకేష్ 5 సంవత్సరాలలో చాలా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడని.. ఈ మాటలు చెప్పే బదులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఇంట్లో కూర్చొని మంగళగిరి అనే పదాన్ని పలకటం నేర్చుకోని అంటే బాగుండు అంటూ తెలుపుతున్నారు.

మంగళగిరి అనే పదం నేర్చుకొని ఎన్నికల ప్రచారానికి వస్తే బాగుంటుందంటూ రామకృష్ణ వెల్లడించారు.. మంగళగిరి ప్రాంతంలో ఇల్లే లేని నిరుపేదలకు 20వేల ఇల్లులు నిర్మించి ఇస్తామంటూ ఒక బూటకపు హామీలను లోకేష్ తెలియజేస్తున్నారని ముందు అక్రమంగా ఉన్నటువంటి ఇంటిలో ఉండకుండా తనకంటూ ఒక సొంత ఇల్లును ఏర్పరచుకోవాలని రామకృష్ణ లోకేష్ పైన సెటైర్లు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు నిర్మించింది అని అలాగే కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది అర్బన్ ప్రైమర్ హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.

ఇలా అన్నిటిలో కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్న వైయస్సార్ పార్టీకి ప్రజలు మద్దతు ఉందని అలా అడిగే ఓటు హక్కు కూడా కేవలం వైయస్సార్ పార్టీకే ఉందంటూ తెలిపారు.. గతంలో మూడు శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మంగళగిరి కి ఏ పని చేశాడు అంటూ ఆయన ఓటు అడగడానికి హక్కే లేదని ఆర్కే వెల్లడించారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్కొక్క మనిషి ఒక్కో సైన్యం అంటూ కూడా వెల్లడించారు. వైసీపీ పార్టీని ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: