అలాగైతే విచారణకు రెడీ.. సీబీఐకి కవిత షాక్‌?

Chakravarthi Kalyan
విచారణకు రావాలంటూ ఇటీవల సమన్లు పంపిన సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాక్‌ ఇచ్చారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సూచించారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కల్వకుంట్ల కవిత తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదన్న కల్వకుంట్ల కవిత... సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు.

2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారన్న  కల్వకుంట్ల కవిత.. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉందన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్న  కల్వకుంట్ల కవిత నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందని  కల్వకుంట్ల కవిత లేఖలో తెలిపారు.

నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందన్న  కల్వకుంట్ల కవిత.. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు... పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని  కల్వకుంట్ల కవిత వివరణ ఇచ్చారు. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించానన్న  కల్వకుంట్ల కవిత.. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని.. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని తెలిపారు. సుప్రీం కోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని  కల్వకుంట్ల కవిత తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: