ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య ఉన్న.. ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ప్రతి చోట కూడా సోషల్ మీడియా సదుపాయం పొందగలుగుతున్నారు అందరూ. ఈ క్రమంలోనే ఇక ఇంటర్నెట్లోకి వెలుగులోకి వచ్చే ఎన్నో విషయాలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతుంటాయ్. మరీ ముఖ్యంగా సినీ సెలెబ్రెటీలకు సంబంధించి ఏదో ఒక విషయం తెరమీదకి వస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు ఇంటర్నెట్ లోకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి. అయితే కొన్ని అభిమానులు గుర్తుపట్టేలాగే ఉంటే.. ఇంకోని మాత్రం ఏకంగా ఆ ఫోటోలో ఉన్నది ఎవరబ్బా అని గూగుల్లో సెర్చ్ చేసేంతలా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇలాంటి త్రో బ్యాక్ ఫోటో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అందరి దృష్టి కూడా ఆ ఫోటోపై పడటం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య అమాయకపు చూపులతో ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు. రమ్యకృష్ణ నగ్మా అప్పట్లో స్టార్ హీరోయిన్గా హవా నడిపించారు అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా ఒక షూటింగ్లో కలుసుకోగా వీరి మధ్యలో ఒక అమాయకపు చూపులతో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు.

 అయితే అది గెటప్ కాదు ఆయన నిజంగానే బ్రాహ్మణుడు. ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టారా.. గుర్తుపట్టలేక పోతున్నారు కదా.. కానీ ఆయన ఒక సెన్సేషనల్ పర్సనాలిటీ.. ఎవరో కాదు వేణు స్వామి. ఇటీవల కాలంలో సినీ సెలబ్రెటీల జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాడు వేణు స్వామి. ఆయన తమ్ముడు ఇక వేణు స్వామి అరుదైన ఫోటోలతో ఒక వీడియో చేసాడట. ఇక ఈ వీడియోని వేణు స్వామి తన ఇంస్టాగ్రామ్ లో  షేర్ చేయడంతో పరిశ్రమ ప్రముఖులు రాజకీయ నాయకులతో వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలోనే నగ్మా, రమ్యకృష్ణలతో దిగిన ఫోటో కూడా ఇందులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: