పాలిటిక్స్ లో ఇప్పటి దాకా ఇలాంటి పిరికోడిని చూడలేదంటున్నా అచ్చేన్నాయుడు...!!
రాక్షసులకు రాక్షసత్వం నేర్పింది కూడా జగనే అనే విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు అంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డాడు. అసూయతో రగిలి పోయే జగన్ ఏమి చేయలేరు.. ఇప్పుడు అధికార బలంతో ర్యాలీని అడ్డుకోవచ్చు ఏమో కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అడ్డుకోవడం జగన్ తాత వల్ల కూడా కాదు అని అచ్చెన్నాయుడు తెలిపారు.ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితులను జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్షించారు. చంద్రబాబు రిమాండ్ గడువు సాయంత్రానికి ముగియడంతో పాటు ఐటీ ఉద్యోగులు కార్లతో ర్యాలీగా రావడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ జైలు రోడ్ లో డీఎస్పీ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు పరిస్తితిని సమీక్షిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేశారు.