ఆ సముద్రంపై పట్టు కోసం రష్యా పంతం?
మొన్నటి వరకు నల్ల సముద్రంపై వాణిజ్య నౌకల ద్వారా రవాణా జరగవచ్చు గాని యుద్ధనౌకలు వెళ్ళకూడదు అని రష్యా ఐక్యరాజ్యసమితికి చెప్పిందట. అయితే ఇప్పుడు ఈ వాణిజ్య నౌకలను కూడా నల్ల సముద్రంపై తిరగడానికి వీలులేదని చెప్తుంది రష్యా. ఎందుకంటే రవాణా పేరుతో వచ్చే వాణిజ్య నౌకలలోనే ఆయుధాలను సరఫరా చేస్తున్నారని అంటుంది ఇప్పుడు రష్యా. రష్యా లోని క్రిమియాకు సంబంధించిన క్రెంచ్ వంతెన ఎప్పుడైతే ధ్వంసం అయ్యిందో అప్పటి నుండి రష్యా తాను పగ తీర్చుకునే సమయం కోసం చూస్తుందని తెలుస్తుంది.
అంతే కాకుండా నాటో దేశాలు గాని అమెరికా, యూరప్ దేశాలు గాని ఉక్రెయిన్ కు సహాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేసింది రష్యా. అవసరమైతే వాళ్లపై బాంబింగ్ కూడా జరుపుతామని అంటుంది. ఉక్రెయిన్ తరుపున నాటో దళాలు నల్ల సముద్రం విషయంలో జోక్యం చేసుకోవాలని అంటుందట ఇప్పుడు. ఒక వేళ అదే జరిగితే రష్యా వర్సెస్ నాటో దేశాల యుద్ధం తప్పనిసరి అంటున్నారు. నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ కీలక సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఈ కౌన్సిల్ ఈ నెల ప్రారంభంలో లిథువేనియాలో నాటో సమ్మిట్ను జరిపింది. మాస్కో పై దాడి, క్రిమియా క్రెంచ్ వంతెనపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి తర్వాత రష్యా నల్ల సముద్రం పై ఆంక్షలు జారీ చేసింది.