యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి అలర్ట్..కొత్త నిభంధనలు..
థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్ శాతం లావాదేవీ పరిమితిని నిర్ణయించాలని ఎన్పీసీఐ నవంబర్ 2022లో ప్రతిపాదించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఎన్పిసిఐ అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బిఐ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఇప్పుడు డిసెంబర్ 31 గడువును పొడిగించడంపై తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాలు తెలిపాయి. గడువును పొడిగించాలని పరిశ్రమ వాటాదారుల నుండి ఎన్పిసిఐకి అభ్యర్థనలు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ఈ నెలాఖరులోగా యూపీఐ మార్కెట్ క్యాప్ను అమలు చేసే అంశంపై ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోవచ్చు.
అంతేకాదు.. మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ద్వారా మీ మొబైల్ బిల్లును కూడా చెల్లించవచ్చు. మీరు 123PAY UPI సేవ సహాయంతో దీన్ని చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇటీవలే 123PAY పవర్ బిల్లు చెల్లింపు సేవ ఇప్పుడు విద్యుత్ బోర్డులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 123PAY సేవ, భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ వినియోగంతో వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను త్వరగా, సులభంగా చెల్లించగలరు.కరెంట్ బిల్లులను నేరుగా బ్యాంకు అకౌంట్ నుంచి చెల్లించ వచ్చు..