819 మంది సైనికులు ఆత్మహత్య.. షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం?
సరిహద్దుల్లో విలాసవంతమైన భవనాలు ఉండవు.. చీకటి పడిందంటే చాలు ఎక్కడో ఒకచోట తలదాచుకోవడమె.. తుపాకి శబ్దం వినిపించింది అంటే చాలు ఉలిక్కిపడి లేచి దేశ భద్రత కోసం మళ్ళీ చేతిలో ఆయుధం పట్టుకొని అప్రమత్తం కావడమె. ఇదే సరిహద్దుల్లో సైనికులు చేసే పని. ఇంత ఒత్తిడిలో కూడా దేశానికి రక్షణ కల్పించడం ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటారు సైనికులు. కుటుంబాలకు దూరంగా కఠిన పరిస్థితుల మధ్య ఆయుధాలు పట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా సరిహద్దులో సైనికులు పహారా కాస్తున్నారు కాబట్టే దేశం నడిబొడ్డున మనం హాయిగా నిద్రపోతున్నాము అని చెప్పాలి.
అయితే సరిహద్దుల్లో పహారా కాయడం అన్నది తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ఎంతోమంది సైనికులు డిప్రెషన్ కి లోనవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవలే వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. గడిచిన ఐదేళ్లలో 819 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఆర్మీలో 642 మంది ఐఎఫ్ఎఫ్ లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది జవానులు ప్రాణాలు తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఒత్తిడి ఆత్మహత్యకు సంబంధించిన మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ సైనికులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే సైనికులలు కమాండింగ్ ఆఫీసర్, రిజిమెంటల్ మెడికల్ ఆఫీసర్లు కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారట.