ఆ లేడీస్‌కు ఇది గోల్డెన్‌ ఆఫర్‌.. ఇవాళ, రేపు మాత్రమే?

Chakravarthi Kalyan
మీడియా రంగంలోనూ మహిళల క్రమంగా సంఖ్య పెరుగుతోంది. అయితే.. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సిఉంది. అంతే కాదు.. ఈ రంగంలోకి వచ్చిన మహిళల కోసం అనేక చర్యలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవాల్సిఉంది. ఈ అంశాలను చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. తెలంగాణ మీడియా అకాడమీ తెలంగాణ మహిళా జర్నలిస్టులందరినీ ఈ కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది. దశాబ్దానికి పైగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ జర్నలిస్టులు గా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నామని గుర‌్తు చేసింది.

 

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు తమ హక్కుల కోసం.. అభివృద్ధిలో తమ భాగస్వామ్యం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా మనం ఒక అడుగు ముందుకేసి మీడియాలో మహిళల ప్రాతినిధ్యం కోసం ఆలోచిస్తున్నాం. ఈ భాగస్వామ్యం పెరగడానికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి మహిళా జర్నలిస్ట్ పాలుపంచుకోవచ్చు. గతంలో కంటే ఈ వర్క్ షాప్ మనందరి భాగస్వామ్యంతో మరింత అర్థవంతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.


ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు ఇండిపెండెంట్ జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల సమస్యలు చర్చించుకొని పరిష్కారానికి మనకంటూ ఒక వేదిక కోసం..మనకంటూ కూర్చొని మాట్లాడుకోగలిగే ఒక స్పేస్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని కొందరు మహిళా జర్నలిస్టులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక  వృత్తిపరమైన సపోర్ట్ కోసం ఈ వర్క్ షాప్ వేదిక కాబోతుందని.. ఒకప్పుడు జిల్లాల్లో మహిళా జర్నలిస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా  జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం పెంచుకునే దిశగా జరుగుతున్న ఈ వర్క్ షాప్ ఓ ప్రయత్నమని.. తెలంగాణలో పని చేస్తున్న ప్రతి మహిళా జర్నలిస్ట్ కి ఆహ్వానం పలుకుతున్నామని వీరు చెబుతున్నారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో హైదరాబాద్ బేగంపేట్ లోని టూరిజం ప్లాజా లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: