కరోనా: ఇండియాలో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా?
తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం భారత్ లో కరోనా దాదాపుగా సన్నగిల్లినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లో కరోనా మహమ్మారి ప్రళయం క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ గణాంకాల ప్రకారం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం రోజురోజుకీ కరోనా వైరస్ తగ్గుతున్నట్టు కనపడుతోంది. రానున్న రోజుల్లో పూర్తిగా ఈ దేశాన్ని వీడి వెళుతుందన్న ఆశాభావాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ ఇప్పటికీ కొన్ని మీడియా చానెళ్లు కరోనా లో ఇంకొక వేవ్ వస్తోందని, జూన్ నెలకు దేశమంతా పాకుతుందని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. కరోనా ఎలాగూ మనతో జీవించే ఒక జీవరాశి అని అనుకోవాలి. అందుకే కరోనా ఎప్పుడైనా రానివ్వండి. మీరు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇక ముందు కూడా గతంలో లాగానే మాస్క్ వాడుతూ, శానిటైజర్ అప్లై చేసుకుని, బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించి కరోనా నుండి రక్షణ పొందండి.