జర భద్రం: ఏమరుపాటుగా ఉన్నారా "కరోనా కాటేస్తది"?

VAMSI
మూడేళ్లపాటు ముప్ప తిప్పలు పెట్టిన కరోనా ఈ మధ్య కాస్త శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ గ్యాప్ ఇవ్వడం కూడా ఎక్కువ అనుకుంటుందో ఏమో కానీ మాయదారి వైరస్ మళ్ళీ తన పంజా విసురుతోంది. పుట్టిన ప్రదేశం లోనే మళ్ళీ వైరస్ తీవ్రత పెరుగుతోంది. చైనాలో మళ్ళీ కేసులు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి. డ్రాగన్ దేశంలో నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. చైనాలో వైరస్ భారిన పడిన వారి సంఖ్య క్రమంగా రోజు రోజుకు పెరుగుతోంది. వేళల్లో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ మరో సారి తన రూపాన్ని మార్చిందా అన్న కోణం లో రీసెర్చ్ చేయగా స్టెల్త్ ఒమిక్రాన్‌ రూపం దాల్చింది అని తెలుస్తోంది.
 
మరో వైపు దక్షిణ కొరియాలోను  ఇదే పరిస్థితి నెలకొంది. కొత్త వేరియంట్ తో విలయం కొనసాగుతోంది. రోజుకు 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో అక్కడ కలకలం మొదలయ్యింది.  ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్‌ బయటపడడం తో ప్రజలు వణికిపోతున్నారు. ఇలా పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసుల సునామీ మొదలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత వరకు ప్రభావం చూపుతుంది? అత్యంత ప్రమాదమా అన్న వివరాలకై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా పలు దేశాల్లో మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ సంచారం భారత్ లోని ప్రజలను కంగారు పెడుతోంది. గతంలో ఇదే విధంగా ఎక్కడో చైనా లో కేసులు కదా అనుకున్నందుకే ఎంతటి ఘోరప్రళయాన్ని సృష్టించిందో మనము చూశాము. అయితే ఇప్పుడు పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే, కరోనా నిబంధనలకు మళ్ళీ అలవాటు పడాలి. ఎప్పటిలాగే మాస్క్, శానిటైజర్ మరియు భౌతిక దూరం పాటించడాన్ని అలవాటు చేసుకోవాలి.  ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నారా మళ్ళీ తన ప్రభావాన్ని చూపి మీ జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: