యూపీ సీఎం "యోగి ఆదిత్యానాధ్" మగాడ్రా బుజ్జి... చరిత్రలో ఒక్కడే?
అయితే ఈ సారి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ కనుక సీఎం అయితే చరిత్ర సృష్టిస్తారు అని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1985 నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం కూడా తర్వాత జరిగే ఎన్నికలో గెలిచిన సందర్భం లేదు. ఇంతకు ముందు యూపీ సీఎం లుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్, మాయావతి, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్, అఖిలేష్ యాదవ్ లు సీఎం లుగా అయిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్న ఆదిత్యానాథ్ విషయంలో అది రివర్స్ అవ్వనుంది.
యోగి గోరఖ్ పూర్ పట్టణ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 60 వేలకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నాడు. కొంత సేపటికి యోగి విజయాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు యోగి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఎంత మెజారిటీతో గెలవనున్నాడు అన్నది తెలియాలంటే ఇంకాస్త సేపు ఆగాల్సిందే. మొత్తానికి యోగి ఇంతకు ముందు సీఎంలు ఎవ్వరూ చేయని విధంగా పాలనా చేసి ప్రజల మనసు గెలుచుకున్నాడు. అందుకే అందరూ యోగిని ఆడు మగాడ్రా బుజ్జి అంటున్నారు...