హై కోర్ట్ తీర్పు పై మాజీ వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు...

VAMSI
ఏపీ ప్రభుత్వానికి మరోసారి హై కోర్ట్ షాక్ ఇచ్చింది. గతంలో చాలా కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకమగా తీర్పులు వెలువడిన విషయం తెలిసిందే. ఇపుడు తాజాగా మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటీషన్ లపై హై కోర్ట్ తీర్పు చెప్పింది. కానీ ఈ తీర్పు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో గందరగోళంగా ఉంది. దానితో ఈ తీర్పు గురించి అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నాయి. ఎప్పటిలాగే ప్రభుత్వానికి వ్యతిరేకముగా వచ్చిన ఈ తీర్పు గురించి విపక్షాలు సంతోష పడుతుండగా, అధికార పార్టీలో ఉన్న నేతల గుండెలు రగిలిపోతున్నాయి. తాజాగా ఇదే విషయంపై నరసరావుపేట మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హై కోర్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అమరావతి విషయంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సబబు అని వారు అనుకుంటున్నారు అని అన్నారు. అయితే ఈ కోర్ట్ లు తమకు అవసరమైన అంశాలను మాత్రమే తీసుకుంటుందని , ప్రజలకు అవసరమయిన వాటిని పరిగణలోకి తీసుకోదని కామెంట్ చేశాడు. ఇక్కడ న్యాయ వ్యవస్థ మరియు శాసన వ్యవస్థలో దేనికి విలువ ఉందని ఆయన అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల కోసం మేము తీయూస్కున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ హై కోర్ట్ నిద్రపోతోందా అంటూ ప్రశ్నించారు. న్యాయ వ్యవాట్షపై ప్రజలకు నమ్మకం ఉండేలా తీర్పులు ఉండాలని సలహా ఇచ్చారు.

అసెంబ్లీ లో చేసిన చట్టాలు చెల్లవు అని చెప్పడానికి కోర్ట్ లకు ఏమి అధికారం ఉందని చురకలు అంటించారు. ఇలా మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించినట్లు కదా అంటూ మాట్లాడారు. అయితే రాష్ట్ర విభజన పై చాల పిటీషన్ లు వేశారని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో చెప్పాలన్నారు. ఇలా మోదుగుల హై కోర్ట్ తీర్పుపై తనదైన శైలిలో రెచ్చిపోయారు. మరి ముందు ముందు ఈ విషయంపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: