కేసీఆర్ కి మంట పుట్టేలా చేస్తున్న పేకాట కేసు..

Purushottham Vinay
ఇక పేకాట అంటే ఎందుకంత కోపం కేసీఆర్ కు అన్న విషయంపై క్లారిటీ లేకున్నా కాని ఆయన వద్ద పేకాట పంచాయితీ కానీ లేదా పేకాటకు సంబంధించిన ముచ్చట్లు అస్సలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత దాకా ఎందుకు.. పేకాట విషయంలో తమ పార్టీకి చెందిన వారిపైనా కఠినంగా వ్యవహరించమని కూడా చెబుతారంటారు. అలాంటి కేసీఆర్.. ఇక తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సోమవారం రాత్రి మాదాపూర్ పరిధిలోని ఒక ఖరీదైన భవనంలో పేకాట ఆడుతున్న వైనంపై పోలీసులకు సమాచారం అనేది అందింది.అంతే..ఇక రంగంలోకి దిగిన ఎస్ వోటీ పోలీసులు.. ఆ రంగంలోకి దిగిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు. అయితే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్సీ స్థాయికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధితో పాటు ఇంకా పలువురు రియల్టర్లు అలాగే మహిళలు ఉన్నట్లుగా సమాచారం. ఇక నిందితుల నుంచి మొత్తం రూ.1.5 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.



రెండు పెద్ద బ్యాగుల నిండా డబ్బులు తీసుకున్న పోలీసులు వాటిని జఫ్తు చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది.ఇక సాధారణంగా పేకాట స్థావరాల మీద దాడి చేసిన వెంటనే.. ఇక ఆ వివరాల్ని పోలీసులు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో మాత్రం వివరాలు వెల్లడించేందుకు అధికారులు ముందుకు రాకపోవటం అనేది గమనార్హం. ఇక ఇదిలా ఉంటే.. పోలీసులు సోదాలు చేసినప్పుడు అక్కడే ఉన్నట్లు చెబుతున్న అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్సీ ని అదుపులోకి తీసుకున్నారా? లేదంటే వారిని వదిలేశారా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక అంతేకాదు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్న మొత్తం డబ్బును తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు అనేవి వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం ఇవ్వటానికి ఆసక్తి చూపని పోలీసులు.. ఇక ఆ తర్వాత మాత్రం ఓపెన్ అయ్యారు.ఇక ఈ పేకాట ఉదంతంపై వస్తున్న వార్తల్లో చాలా వరకు కూడా అసత్య ప్రచారం అనేది జరుగుతుందని చెబుతున్నారు.



అలాగే పట్టుబడింది ఎనిమిది మంది అని.. ఇంకా అందులో ఐదుగురు పురుషులు.. అలాగే ముగ్గురు మహిళలు ఉన్నారని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే.. పేకాట భవనంపైనా పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ప్లాట్ ఒక ప్రముఖ మంత్రికి సంబంధించిన కీలక అనుచరుడని.. ఇంకా అలాగే ఆయన కూడా నేతగానే చెలామణీ అవుతున్నట్లుగా సమాచారం అనేది తెలుస్తోంది.అలాగే తన పార్టీలోని ఈ పేకాట గబ్బు ఎపిసోడ్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు గనుక తెలిస్తే.. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకోవటం అనేది ఖాయమని.. దెబ్బకు అందరికి క్లాస్ పక్కా అంటున్నారు. ఇంతకీ.. ఈ పేకాట ఎపిసోడ్ లో తెలంగాణ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అనేవారు ఉన్నారా? లేదంటే.. ఇదంతా కూడా ఉత్త ప్రచారమా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: