మంత్రి పేర్ని నానిపై పవన్ అభిమానుల ఆగ్రహం..
సినిమా టికెట్లకి, పవన్ కి సంబంధం ఏంటి..?
గతంలో ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్లు, ఆన్ లైన్ వ్యవహారం గురించి మాట్లాడారు, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కౌంటర్లు పడ్డాయి. అక్కడితో ఆ వ్యవహరం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్లీ టికెట్ల వ్యవహారంలో చిరంజీవి నేతృత్వంలోని ఓ బృందం సీఎం జగన్ తో భేటీ అయింది. ఇక్కడ పవన్ ని పిలిచారో లేదో తెలియదు కానీ ఆయన రాలేదు, వస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. మరి అలాంటప్పుడు పవన్ ప్రస్తావనే లేని సినిమా టికెట్ల వ్యవహారంలో అనవసరంగా ఆయన్ను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు అభిమానులు డైలమాలో ఉన్నారు. సినిమా సెన్సార్ కూడా ఆలస్యం అవుతోంది. దీనికి కారణం ఎవరని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటాయేమోని అంటున్నారు. గతంలో వకీల్ సాబ్ సమయంలో కూడా బీజేపీ నేతలు సినిమా థియేటర్ల వద్ద హంగామా చేశారు. ప్రభుత్వం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిందని అన్నారు. ఇప్పుడు భీమ్లా విషయంలో ఏమంటారో చూడాలి. మొత్తానికి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మాత్రం జనసైనికులు మండిపడుతున్నారు.