గుడ్‌న్యూస్‌: ఆ ఉద్యోగుల జీతాలు పెంచిన జగన్..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకూ ప్రభుత్వానికీ మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతోంది. పీఆర్సీ అమలు విషయంలో ఇరుపక్షాలకూ సంధి కుదరడం లేదు. మొదట్లో కుదిరినట్టే కుదిరినా చివరి నిమిషంలో జారి పోయింది. మొత్తానికి పాత జీతం ఇచ్చినా పర్వాలేదు.. కానీ తగ్గించకండి మహా ప్రభో అని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే.. ఇదే సమయంలో సీఎం జగన్.. మరో వర్గం ఉద్యోగస్తుల జీతాలు మాత్రం పెంచేశారు.

ఇంతకీ ఎవరా ఉద్యోగులు అంటారా.. వాళ్లే ఏపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. జగన్ సర్కారు ఇప్పుడు వీరి జీతాలు పెంచింది. కొత్త వేతనాల ప్రకారం.. వీరికి కనీస వేతనం పదిహేను వేల రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఔట్‌ సోర్సింగ్‌ వేతనాల పెంపు ప్రభావం కారణంగా  ప్రభుత్వం దాదాపు ఎనిమిది వందల కోట్ల భారం పడుతుందట. ఈ మేరకు నిపుణులు అంచనా వేశారు. ఇలాంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మందికి వరకూ ఏపీలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వారివారి  కేటగిరీల వారీగా జీతాలు పెరిగాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. కేటగిరి 1కు పెరిగిన నెల వేతనం రూ. 21,500గా ఉంది. ఈ కేటగిరీ కిందకు సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో,సీనియర్‌ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్,డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌ వ్తారు. అలాగే కేటగిరి 2 ఉద్యోగస్తులకు పెరిగిన నెల వేతనం రూ. 18,500గా ఉంది. ఈ కేటగిరీలో డ్రైవర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్‌ ఆపరేటర్, స్టోర్‌ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్‌ అసిస్టెంట్, సూపర్‌వైజర్, మేనేజర్‌ వంటి వారు వస్తారు.

కేటగిరి 3 వారికి పెరిగిన నెల వేతనం రూ. 15,000గా ఉంది. ఈ కేటగిరీలోకి ఆఫీస్‌ సబార్టినేట్, వాచ్‌మెన్, కుక్, వాచ్‌మెన్, కుక్‌ చౌకీదార్, సైకిల్‌ ఆర్డర్లీ, లిఫ్ట్‌ ఆపరేటర్, ల్యాబ్‌ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్‌ ఆపరేటర్, రికార్డ్‌ అసిస్టెంట్‌ వంటి ఉద్యోగులు వస్తారు. ఈ పెంపుతో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం సంతోషంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: