కన్నా సైలెంట్‌గా సెట్ చేసుకుంటున్నారా?

M N Amaleswara rao
కన్నా లక్ష్మీనారాయణ...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నేత. అలాగే గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన నాయకుడు. టీడీపీ హవా ఉన్న సమయంలో కూడా పెదకూరపాడు నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన నేత. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. అలాగే 2009 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి గెలిచారు. ఇలా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా...రాష్ట్ర విభజన తర్వాత ఫామ్ కోల్పోయారు. ఒకవేళ ఈయన వైసీపీ గానీ, టీడీపీలో గానీ చేరి ఉంటే రాజకీయంగా నిలదొక్కుకునే వారు.
కానీ బీజేపీలో చేరడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష పదవి ఉన్నంత కాలం పార్టీలో బాగానే పనిచేశారు. పదవి పోయాక మాత్రం యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే బీజేపీలో మెరుస్తున్నారు. ఇక ఈ మధ్య కాస్త దూకుడుగానే ఉంటున్నారు. ఇలా బీజేపీలో పనిచేస్తున్న కన్నా...తన పోలిటికల్ ఫ్యూచర్‌పై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఎందుకంటే బీజేపీలో ఉంటే రాజకీయంగా సెట్ అవ్వడం చాలా కష్టం. పైగా ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. కాకపోతే నెక్స్ట్ గానీ టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పొత్తు ఉండేలా కనిపించడం లేదు. అయితే టీడీపీ-జనసేనల పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. అదే జరిగితే కన్నా బీజేపీని వదలడం ఖాయమని తెలుస్తోంది. అప్పుడు జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ సీటు దక్కించుకుంటే కన్నాకు గెలుపు ఈజీనే. ఇప్పుడు ఆ దిశగానే కన్నా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కాపు నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే కన్నా...జనసేన వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి కన్నా పోలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: