'ఒమిక్రాన్' నుండి బయటపడాలంటే అదొక్కటే మార్గం... ?
ఒకవేళ అలా కరోనా వచ్చిన వారిని కూడా క్వారంటైన్ అంటూ ముందు జాగ్రత్తలు చేస్తున్నారు. అయితే మరో వైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం అధికారులకు సవాలుగా మారింది. ఇటు ప్రజలు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువయ్యే కొద్ది ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి ఒక్కో ఒక్కో వ్యూహాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే దేశంలో ఒమిక్రాన్ కేసులు 40 కి దాటగా నైట్ కర్ఫ్యూ విధించే విధంగా ప్రణాళిక రచిస్థున్నట్లు తెలుస్తోంది.
అయితే అది కేవలం ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో ఆ రాష్ట్రాలలోనేనా లేక అన్ని రాష్ట్రాలలోనా అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 కి చేరినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ సదరు ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మన జాగ్రత్తలో మనము ఉంటే ఈ ఒమిక్రాన్ బారి నుండి బయట పడవచ్చు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే దీని నుండి బయట పడే మార్గం.