తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 08 జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మొత్తం 13 మంది మృత్యువాత పడి.. మరొక సైనికుడు చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన లాన్స్నాయక్ సాయితేజ భౌతిక కాయాన్ని ఇవాళ బెంగళూరు నుంచి తొలుత మదనపల్లికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎగువ రేగడ గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఎగువ రేగడలో అంబులెన్స్పై పువ్వులు చల్లుతూ నివాళులర్పించారు. భర్త భౌతిక కాయం దగ్గర భార్య శ్యామల సొమ్మసిల్లిపోయి పడిపోయింది. సాయితేజకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కుమారుడు మోక్షాజ్క్ష కలరు. తెలుగుతేజం సాయితేజకు యావత్ దేశమంతా జేజేలు పలికింది. తండ్రి భౌతికకాయాన్ని కౌగిలించుకుని బోరున విలపోయారు. దారి పొడువునా వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. ముఖ్యంగా సాయితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమ యాత్ర మూడు నాలుగు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగిన తరువాత ఎగువరేగడ చేరుకుంది సాయితేజ పార్థివ దేహం.
అంబులెన్స్పై పువ్వులు చల్లుతూ నివాళులర్పించారు. 11 పారాలో లాన్స్నాయక్ గా చేరారు సాయితేజ. 2020వరకు సాయితేజ బెంగళూరు ఆర్మీలో శిక్షణ పొందారు. ముఖ్యంగా 2014లో పారా కమాండో పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యారు సాయితేజ. సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలను ఆదివారం ఎగువరేగడలో నిర్వహించారు. సాయితేజ సోదరుడు మహేష్, కుమారుడు మోక్షాజ్ఞను ఎత్తుకుని అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా సాయితేజ ఫోటోను చూసి కుమారుడు మోక్షాజ్ఞ లవ్ యూ డాడీ లయ్ యూ అని పేర్కొనడం అందరినీ కంటతడి పెట్టించినది. సాయితేజ భౌతికకాయాన్ని చూసేందుకు ఎగువరేగడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. గ్రామస్తులు, బంధువులు కన్నీటి నివాళి అర్పించారు. సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. జై సైనికా.. అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో పలువురు నినాదాలు చేసారు. భారత ఆర్మీ సాయితేజ చిత్రపటాన్ని కుటుంబ సభ్యులకు బహుకరించారు.