ఒమిక్రాన్: వరల్డ్‌కు వర్రీ - ఇండియాకు గుడ్‌న్యూస్?

Chakravarthi Kalyan
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వర్రీ పెరుగుతోంది. అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో కరోనా మూడో వేవ్ తప్పదని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఒమిక్రాన్‌ ఇండియాలోనూ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 30కు పైగా ఒమిక్రాన్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. దీనికి తోడు ఇండియాలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే.. ఇండియాకు కూడా ఒమిక్రాన్ వర్రీ తప్పదేమో అనిపించకమానదు.


అయితే.. ఇదే సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.. అదేంటంటే.. ఒమిక్రాన్‌తో మిగిలిన దేశాలు కుదేలవుతున్నా ఇండియాకు ఆ ముప్పు వచ్చే అవకాశం లేదట.. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో పెరిగినా చెప్పుకోదగ్గ స్థాయిలో అది మనల్ని ఏమీ చేయలేదట. ఈ ఊరట ఒక్క భారత్‌కు మాత్రమే ఉండటం విశేషం. మరి ఎందుకు ఇండియాకు ఆ ప్రత్యేకత అంటే.. ఇండియాలో ఉన్న సీరో పాజిటివిటీ రేటు అందుకు కారణమట. మన ఇండియాలో అధిక స్థాయిలో ఈ సీరోపాజిటివిటీ రేటు ఉండటం వల్ల మనవాళ్లు పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదట.


అసలు ఈ సీరో పాజిటివిటీ రేటు అంటే.. ఏంటి.. ఇది ఇండియాలో ఎందుకు ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా ఉంటే వచ్చే ప్రయోజనాలేంటి అంటారా.. ఈ వివరాల్లోకి వెళ్తే.. ఇండియాలో 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటు ఉంది. ప్రజల్లో ఉన్న యాంటీ బాడీస్ ఆధారంగా ఈ పాజిటివిటీ రేటును పరిగణలోకి తీసుకుంటారు. ఇండియాలోని నగరాల్లో 90 శాతానికి పైగా ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయట. ఈ విషయాన్ని ఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెబుతున్నారు. ఇండియన్లలో ప్రతిరోధకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒమిక్రాన్ సోకినా భయపడాల్సిందేమీలేదు.. ఒమిక్రాన్‌ వచ్చినా లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అంతే కాదు.. ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: