దొంగ ఓట్లపై వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఏమన్నారంటే..?
ఫొటోలతో కూడిన ఓటరు జాబితా లో పోల్చుకునే ఏజెంట్లు ఓటింగ్ కు అనుమతించారు. పలానా వ్యక్తి దొంగ ఒట్లు వేశారని, దొంగ ఓట్లు పోలయ్యాయని ఎక్కడా, ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు. తెలుగుదేశం పార్టీ కోరిన వారినే ఏజెెంట్లుగా కూర్చో పెట్టారు. అక్రమాలు జరిగితే రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి కానీ ఎక్కడా అలా జరగలేదని వెల్లడించారు. ఏ బూతులో అక్రమాలు జరిగాయో చెబితే ఆ బూతులో ఏం జరిగిందో మేము చెబుతాం అన్నాఉ. దొెంగ ఒట్లు వేశారనేది కేవలం చంద్రబాబు కట్టుకథలే అని, దొెగ ఒట్లు వేశారు, అక్రమాలు జరిగాయని చెబుతున్నవన్నీ తప్పుడు ఆరోపనలే అని విమర్శించారు ఎంపీ మిథున్రెడ్డి.
ఎన్నికల్లో ఏదో జరిగిందని ప్రచారం చేసిందని, కుప్పానికి వచ్చిన వారంతా ఇతర మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తెప్పించిన వారేనని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ చేసి దానిని వైకాపా వైపు చూపించడం సరైెందికాదు అన్నారు. కుప్పం లో ఎన్నికలు సవ్యంగా జరిగాయి, జగన్ కు ఒటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చి ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందంటూ ఏమీ లేదని చెప్పారు.
చంద్రబాబు హయాంలో కుప్పంకు కనీసం నీరు కూడా ఇవ్వలేదని, హంద్రీనీవా నుంచి కుప్పంకు సీఎం జగన్ నీరు ఇచ్చారని గుర్తు చేశారు. 25వేల దొెంగ ఓట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేస్తే 18వేలు దొంగ ఓట్లను గతంలో ఎన్నికల సంఘం తీసేసింది. కుప్పంలో ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపై మేమే ఈసీకి ఫిర్యాదు చేసామని వివరించారు. కుప్పంలో వైసీపీ తప్పకుండా గెలుస్తుందని, కుప్పంలో కౌంటింగ్ను వీడియో తీయాలన్న హై కోర్టు ఆదేశాలను మేము ఆహ్వానిస్తున్నాం అని ప్రకటించారు ఎంపీ మిథున్రెడ్డి.