తెలంగాణ కాంగ్రెస్ లో ఆ నాయకులకు ఏమైంది.. పరిస్థితి మారుతుందా..?

MOHAN BABU
తెలంగాణ కాంగ్రెస్ లో ఆ జిల్లాల నాయకుల తీరే వేరా?  పార్టీకి కంచుకోటగా భావించే ప్రాంతాల్లో నేతలు ఎందుకు సబ్దిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? గ్రేటర్ హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందా?  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే కాదు, బలమైన క్యాడర్ కూడా ఉంది. అలాంటిది ఆ రెండు ఉమ్మడి జిల్లాలో నేతలు స్తబ్దుగా  ఉండిపోవడం గాంధీభవన్ వర్గాల్లో చర్చ గా మారింది. కొత్త పిసిసి సారధ్యంలో పలు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెడుతున్నారు. మరి కొన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు  ముందుకు వచ్చి సభలకు డేట్లు ఫిక్స్ చేయమని కోరే పరిస్థితి ఉందట.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పిసిసి ఎంట్రీ ఇవ్వలేని పరిస్థితి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి లు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. పార్టీలో హేమాహేమీలు గా గుర్తింపు పొందినా ఇక్కడ పార్టీ ఆక్టివిటీ లేకపోవడం లో రకరకాలుగా చర్చకు దారితీస్తోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఆ ప్రభావం వల్లే పిసిసి కూడా  ఇటు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న బాధ నుంచి ఇంకా బయటపడలేదు. రేవంత్ ను ఓపెన్ గానే  వ్యతిరేకిస్తున్నారు. పిసిసి తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. దళిత, గిరిజన దండోరా సభ, నల్లగొండలో  పెట్టాలనుకున్న అక్కడ నాయకులు నో చెప్పడంతో దానికి బ్రేక్ పడింది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించే చోట కాంగ్రెస్ కార్యక్రమాల ఊసేలేదు. పైగా ఉత్తమ్,రేవంత్ మధ్య సఖ్యత లేదన్నది ఓపెన్ టాక్. పీసీసీ కీ వ్యతిరేకంగా మాట్లాడే వారి వెనుక ఉత్తమ్ ఉన్నారనే అనుమానం కూడా రేవంత్ కు ఉందటా. ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకులతో సఖ్యత లేకపోవడం వల్ల అక్కడ సభలు, సమావేశాల ప్రస్తావనే  లేదు. మాజీ మంత్రి జానారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సన్నిహిత సంబందాలు ఉన్నాయి. జానారెడ్డి కుమారుడు రఘువీర్ తో రేవంత్ ఇంకా సన్నిహితంగా ఉంటారు. జానారెడ్డి ఇలాకలో సభ పెట్టాలని అనుకున్న ఓ ముఖ్య నాయకుడు నో చెప్పినట్లు సమాచారం. దీంతో పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉండే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సైలెంట్ అయిపోయింది.

 ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ పట్ల  పోలీసుల తీరును నిరసిస్తూ జరిగిన ఆందోళనలో ఈ ఎంపీలిద్దరు తళుక్కుమన్నారు. పీసీసీ తో ఇక్కడి నాయకుల వైరం ఎప్పటి వరకు కొనసాగుతుంది, కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా లేవా, కాంగ్రెస్ లో ఇదో అంతుచిక్కని ప్రశ్న. అప్పట్లో ఇబ్రహీంపట్నం సభ విషయంలోనే రేవంత్, కోమటిరెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయి. నాటి నుంచి ఉమ్మడి నల్గొండ జోలికి రేవంత్ వెళ్లడంలేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: