అరుణాచల్ ప్రదేశ్లో చైనా మళ్లీ అత్యుత్సాహం ప్రదర్శించింది అనాలా లేకపోతే ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోకపోతే చైనాకు చెల్లుబాటు అయ్యేలా కనిపించడం లేదని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న తైవాన్ మీద వరుస పెట్టి యుద్ధవిమానాలు పంపించింది చైనా దేశం. మూడు రోజులపాటు చాలా ఓవర్ ఆక్షన్ ప్రదర్శించింది. ఆ తర్వాత జో బిడెన్ జిన్పింగ్ లకు ఫోన్లు చేసి గతంలో మనం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తైవాన్ లోనికి పోకూడదు అని చెప్పాను కదా అంటే ఏమైందో తెలియదు.
దీంతో తైవాన్ ఇష్యూ కొద్దిగా స్లోగా అయిపోయింది. అది అంతటితో అయిపోగానే మళ్లీ భారత్ వ్యవహారంలో మాత్రం తల దూర్చింది. ఇదివరకు అరుణాచల్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కొనసాగింది. మళ్లీ ప్రస్తుత సమయంలో చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకొని వచ్చింది. దీంట్లో సుమారు 200 మంది చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ లో చూడడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే భారత బంకులను కూడా నాశనం చేయాలని చైనా ఆర్మీ చూస్తే వెంటనే భారత్ కూడా చైనా సైనికులకు ధీటుగా సమాధానాన్ని పంపించాయి.
ఈ సందర్భంలోనే ఇరుదేశాల సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి ఒప్పందం ఆధారంగా ఇంతకు ముందులాగా బాంబులతో గాని, తుపాకులతో గాని యుద్ధం చేసుకోడానికి లేదు. ఓన్లీ ఒకరినొకరు ఫిజికల్ గానే వారి బలబలాలు చూసుకోవాలి. ఈ సందర్భంలోనే చైనా సైనికులు ఇది మా ప్రాంతం అంటూ భారత సైనికుల పై దాడులు చేస్తూ ఉంటే, మా ప్రాంతమంటూ భారత సైనికులు కూడా దీటుగా బదులిస్తూ మీ ప్రాంతం అయితే మీ దేశంలో చెప్పకుండానే చైనాకు తిప్పికొట్టింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య యుద్ధవాతావరణం నెలకొని టూ ఉండేది. చైనా సైనికులు ఏమో ఇది మా ప్రాంతం అంటూ చెప్పుకొస్తున్నారు.