ఏపీ టీడీపీకి వృద్ధ నాయకులు తలనొప్పిగా మారారా..?

frame ఏపీ టీడీపీకి వృద్ధ నాయకులు తలనొప్పిగా మారారా..?

MOHAN BABU
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కి పెద్దల సమస్య వచ్చి పడింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వృద్ధ నేతలు ఉన్నారు. వీరిని వదిలించుకుంటే ఒక బాధ వదిలించుకోకుండా ఉంటే ఒక బాధ. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంపై రివ్యూ చేశారు. పార్టీని గాడిలో పెట్టాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలు అనుకున్నంత సాదాసీదాగా జరిగేవి కావనే అంచనాలు వస్తున్నాయి. పార్టీల మధ్య సఖ్యత ఉన్న, ఎవరి బలం వారు చూపించేందుకు రెడీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి పొత్తులపై ఆధారపడే కన్నా..సొంతంగా బలం పుంజుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో యువతను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దాదాపు నలభై నియోజకవర్గాల్లో వృద్ధ నేతలు అంటే 60 ఏళ్లు పైబడిన వారు తిష్ట వేశారు. వారు ఒకప్పుడు వెలిగిన మాట వాస్తవమే. ఉదాహరణకు అరకులో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో  శత్రుచర్ల విజయరామరాజు  శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ లక్ష్మీదేవి గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గుమ్మడి కుతూహలమ్మ తిరుపతిలో సుగుణమ్మ.. ఇలా అనేక మంది వృద్ధ నాయకులు ఉన్నారు.


 వీరంతా కూడా ఒకప్పుడు వెలిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మాత్రం వీరి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వంపై ఉద్యమిద్దాం రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు.పోనీ సొంతంగా ఐడియా అయిన ఇస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లోనూ వీరికి టికెట్లు కావాలని పంతం పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో ఇతర నేతలను కూడా ఎదగనివ్వడం లేదనే వాదన ఉంది. యువత బయటకు వస్తున్న తమ మాటే నెగ్గించుకోవాలని ఈ వృద్ధ నేతలు భావిస్తున్నారు. దీంతో యువత ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వృద్ధ నేతలకు పార్టీలో పదవులు కట్టబెట్టి వారిని తప్పించాలనేది  పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచన. ఇదే విషయంపై తాజాగా చంద్రబాబు చర్చించారు.


పార్టీలో వృద్ధులుగా ఉన్నవారిని తప్పిస్తే తప్ప యువ నాయకత్వంలో దూకుడు పెరగదని నిర్ణయానికి వచ్చారు. అయితే వృద్ధులను తప్పిస్తే వారి వల్ల కమ్యూనిటీ ఓటుబ్యాంకు దెబ్బతింటుందనే ఆందోళన మరోవైపు బాబును  వేధిస్తుంది. పోనీ పక్కన పెట్టకపోతే వైసీపీ యువ నాయకుల దూకుడుతో మొదటికే మోసం వస్తుందని ఆవేదన కనిపిస్తుంది. దీంతో వృద్ధ నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకోకుండా వారిని ఒప్పించి, తప్పించే బాధ్యతలను మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప.. వంటి వారికి అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: