దైవ ప్రసాదం.. ప్రాణం మీదికి తెచ్చింది?

praveen
సాధారణంగా హిందూ దేవాలయాల్లో ప్రతి రోజు కూడా దేవుడికి నైవేద్యం పెట్టడాన్ని చూస్తూ ఉంటాం . ఇక ఈ నైవేద్యాన్ని   భక్తులందరికీ ప్రసాదంగా పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా దేవాలయంలో ప్రసాదాన్ని భక్తులు ఎంతో అపురూపం గా భావిస్తూ ఉంటారు. ప్రసాదం కొంచెం అయినా సరే పది మందికి పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఇలా దైవసన్నిధిలో ప్రసాదం తినడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని సకల అరిష్టాలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. అందుకే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా దేవుడి ప్రసాదం కోసం పోటీపడి మరీ తీసుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాం.


 కానీ ఇక్కడ మాత్రం ఆయురారోగ్యాలతో ఎంతో ఆనందం గా ఉండేందుకు తీసుకున్న దేవుడి ప్రసాదం  ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చింది అని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దైవ ప్రసాదం కారణం గా 80 మంది అస్వస్థతకు గురి కావడం సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. అయితే ఇక ప్రసాదం తిన్న 80 మంది అస్వస్థతకు గురికావడం తో అందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.



 చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం లోని బండ్లపల్లి లో గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంచారు. అయితే ఈ ప్రసాదం తిన్న 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక వెంటనే వారిని మదనపల్లి, నిమ్మనపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలా అస్వస్థతకు గురైన 80 మందిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా భక్తులందరూ భయంతో వణికిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: