1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు తమిళనాడులో శ్రీ పెరంబదూర్లో జరిగిన బాంబు పేలుడులో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించారు. ఆ సమయంలో బాంబు పేలుడు జరిగిన స్థలానికి సరిగ్గా పది గజాల దూరంలో జర్నలిస్టు నీనా గోపాల్ ఉన్నారు. నీనా గోపాల్ రాజీవ్ సహచరుడు సుమన్ దూబేతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆనాటి ఘటనను నీనా గోపాల్ గుర్తు చేస్తున్నారు. ముప్పై ఏళ్లున్న ఓ యువతి గంధపు మాల తీసుకుని రాజీవ్ వైపు కదిలి, ఆయన పాదాలను తాకేందుకు వంగగానే పేలుడు సంభవించింది. తాను ఆ రోజు బతికానంటే అది ఒక అద్భుతమేనని నీనా గోపాల్ చెప్పింది.
తాను రాజీవ్ గాంధీ అనుచరుడు సుమన్ దూబేతో మాట్లాడటం స్టార్ట్ చేసి టూ మినట్స్ కాకమునుపే బాంబు పేలిందని తెలిపింది. తాను సాధారణంగా వైట్ డ్రెస్ వేసుకోబోనని, కానీ, ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల బాంబుపేలగానే తన తెల్ల చీర మొత్తం నల్లగా మారిపోయిందని పేర్కొంది. వైట్ సారీపై మనుషుల మాంసం ముద్దలు, రక్తపు చుక్కలు పడ్డాయని, తన ముందు నిలబడిన అందరూ చనిపోయారని, కానీ, తాను మాత్రం బతికిపోయానని తెలిపింది నీనా గోపాల్. బాంబు పేలడానికి ముందర చిన్న శబ్దం వినపడిందని, ఆ తర్వాత బాంబు పేలిందని తెలిపింది నీనా. ఇక బాంబు పేలగానే జనాలు అటు ఇటు పరిగెత్తారు.
ఈ క్రమంలోనే అందరిలో భయం ఆవహించింది. అయితే, అప్పుడు రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనేది ఎవరికి తెలియరాలేదు. కొద్ది సేపటి తర్వాత తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి రాజీవ్ కోసం వెతకడం షురూ చేశారు. అంతంలో ఆయన బాడీలోని ఒక పార్ట్, సగం తల కనిపించింది. కపాలం ఛిద్రమై దాని నుంచి బయటకు వచ్చిన మెదడు సెక్యూరిటీ ఆఫీసర్ పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. అప్పటికే రాజీవ్ అంతిమ ఘడియల్లో ఉన్నారు. మూపనార్ రాజీవ్ గాంధీ బాడీ పార్ట్స్ను గుర్తించారు. ప్రదీప్ గుప్తా మోకాళ్ల దగ్గర నేలపై ఛిద్రమైన ఒక తల కనిపించింది. అది రాజీవ్ గాంధీ తల. ఆ సమయంలో రాజీవ్ బాడీ పార్ట్ కనిపించిన ప్లేస్ నుంచి కొంత దూరం వెళ్లాక మహిళా జర్నలిస్టు నీనా గోపాల్కు రాజీవ్ గాంధీ శరీరం కూడా కనిపించింది. రాజీవ్ లోటో షూస్, హ్యాండ్స్, వాచ్ ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ చూసినట్లు నీనా పేర్కొంది. ఇక ఈ విషయాం సోనియాకు తెలపగా ఆమె బోరున విలపించింది. ఇక ఆ తర్వాత రాజీవ్ హత్య వెనుక ఎల్జీటీఈ హస్తం ఉందని తేలింది. హత్య జరిగిన ఏడాది లోపు చార్జిషీటు దాఖలు చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు.