మోడీవి మాటలే.. చేతల్లేవ్ : రాహుల్

praveen
కరోనా వైరస్ ఇండియాను సంక్షోభం లోకి నెట్టేసింది. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అన్ని రంగాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయ్. ఇక ప్రస్తుతం రూపాంతరం చెందుతున్న కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో మళ్లీ పుంజు కోలేకపోతున్నాయి  అన్ని రంగాలు. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కారు తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూనే  ఉన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అంటూ గత కొన్ని రోజుల నుంచి రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు.



 ఓవైపు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న..  దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోన్నప్పటికీ మోడీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు అంటూ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఇక ఇటీవల మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో టీకాల కొరకు ఎంతగానో వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత కారణంగా ఎంతోమంది నిరాశ చెందుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ... టీకాల కొరతతో మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


 అయితే దేశంలో ఏర్పడిన టీకాల కొరతపై ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత వేధిస్తోంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు  అందరికీ టీకాలు అందించేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోంది అని మోడీ గారు చెబుతున్నారు.. కానీ కేంద్ర ప్రభుత్వానికి మాటలే కాని చేతలు లేవు అంటూ కేంద్రంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ.  టీకాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అంతేకాదు గతంలో ఒక మీడియా సంస్థ ప్రచురించిన వార్తను కూడా టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.   దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతూ ఉండటంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: