నోరు జారిన మరో తెలంగాణ మంత్రి.. వైరల్ వీడియో?

praveen
పొలిటిషియన్స్ అన్న తర్వాత ఎంతో ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాత్రం నోరు జారిన చివరికి వారి వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయ్. అంతే కాదు ఎంతో మంది ప్రతి పక్ష నేతలు విమర్శలు చేయడానికి కారణం గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇటీవలే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక గ్రామ సభలో మాట్లాడిన సమయంలో ఎంపీడీవో పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిపోయింది.  ఇటీవలే ప్రతిపక్ష పార్టీల నేతలందరూ ఎర్రబెల్లి దయాకర రావుఫై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఇక్కడ మరో తెలంగాణ మంత్రి నోరుజారి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయారు.



 సాధారణంగా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీ కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.  అయితే ఇలా పార్టీ మారిన తర్వాత గతంలో ఉన్న నాయకుడి పేరు ను వదిలేసి ప్రస్తుత నాయకునికి జై కొట్టాల్సి  ఉంటుంది. రాజకీయ నాయకులందరూ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కొన్ని కొన్ని సార్లు ప్రసంగిస్తున్న సమయంలో ఇక పాత పార్టీ జ్ఞాపకాలు గుర్తు వస్తాయో ఏమో తెలియదు కానీ పాత నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ  హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక ఇటీవలే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



 టిడిపి పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు గంగుల కమలాకర్. ఆ తర్వాత టిఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం మంత్రి హోదాలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇక ఇంత మంచి పథకాలను ప్రవేశపెట్టిన చంద్రబాబుకు అందరు దీవెనలు అందించాలి అంటూ వ్యాఖ్యానించారు.  ఇక్కడ కేసీఆర్ కి బదులు చంద్రబాబు పేరు ప్రస్తావించారు గంగుల కమలాకర్. ఆ తర్వాత వెంటనే గ్రహించి కెసిఆర్ కి దీవెనలు అందించాలి అంటూ గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: