రెండేళ్ల ప్రేమ.. అడ్డొచ్చిన కులం.. చివరికి?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం అధునాతన నాగరికత వైపు అడుగులు వేస్తూ ఉంటే.. ఇప్పటికి కూడా కొంత మంది కులం మతం పేరుతో మనిషి జీవితాన్ని అనాగరిక సమాజంలోకి నెట్టేస్తున్నారు.  రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు  ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ జంటల పాలిట కులం,మతం అనేది శాపంగా మారిపోతుంది. కులం,మతం వేరు ఉన్నవారిని చేసుకోవడంతో.. తల్లిదండ్రులు రగిలిపోయి ఏకంగా పరువు హత్యలకు పాల్పడడం కూడా సంచలనంగా మారిపోతుంది.



 ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. టీనేజీలో ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది  ఇక కొంత సమయం లోనే ఒకరి మనసు ఒకరికి దగ్గరయ్యింది  ఇక ఆ తర్వాత ఒకరిని విడిచి ఉండలేవు అని అనుకున్నారు. ఇక పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కటి కావాలని అనుకున్నారు. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలచినట్లు.. వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి పెద్దలు ఒప్పుకోలేదు. అంతేకాదు యువతికి వేరొకరితో వివాహం చేసేందుకు కూడా తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.



 అయితే ఒక వైపు తల్లిదండ్రులను ఎదిరించ లేక.. మరోవైపు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇక ఆ ప్రేమ జంట కుంగి పోయింది. ఎలాగూ కలిసి బ్రతక లేక పోతున్నాం.. చావు లో నైనా కలిసి ఉండాలి అనుకున్నారు.  ఎవరికి ఆత్మహత్య చేసుకున్నారు.  నెల్లూరు జిల్లా ఆత్మకూరు గిరిజన కాలనీ ఘటన చోటు చేసుకుంది. నవీన్, ఆయేషా ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో ఇక చావు లో నైనా  కలిసి ఉండాలని భావించిన ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: