కాశ్మీర్ లో సరికొత్త రికార్డ్.. ఇమ్రాన్ కి చెంప పెట్టె?
కాశ్మీర్ భూభాగంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుంది. ఏకంగా కాశ్మీర్ లోని నాలుగు జిల్లాలలో 45 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఇటీవలే అధికారులు నివేదికలో తెలిపారు. అంతే కాకుండా అక్కడి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా 50 శాతం నుంచి 70 శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. పూర్తిగా జమ్మూకాశ్మీర్లో 66 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.
అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా నాలుగు జిల్లాలలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కాశ్మీర్లోనే పూర్తి కావడం గమనార్హం. ఇలా 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కాశ్మీర్ భూభాగాన్ని అభివృద్ధి చేయడం విషయంలోనే కాదు కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కూడా కాశ్మీర్ కు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది అనే విషయం తెలుస్తుంది. అయితే ఓ వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే.. మరోవైపు భారత్ లో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం అక్కడి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ కరోనా వైరస్ పోరాటంలో మనోధైర్యాన్ని కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం.