మోడీ మాత్రమే కాదు - మోడీ బాబు కూడా ఈ దేశాన్ని బాగు చేయలేరు

తెలంగాణా ప్రభుత్వం ఈరోజు లాక్డౌన్ ప్రకటించగానే జరిగిన ఆశ్చర్యకరమైన గుర్తించవలసిన అంశం ఏమంటే గుంపులు గుంపులుగా జనం వైన్ షాపుల ముందు "బౌతిక దూరం పాటించక పోగా కొందరైతే సరిగ్గా మాస్కులు కూడా పెట్టుకోకుండా వైన్ షాపుల ముందు పది రోజులకు సరిపడా మందు బాటిల్స్ కొనటం కనిచింది అదీ వందలు వేల రూపాయిలు ఖర్చుచేసి, వైన్ షాపుల్లో నిల్వలు సమాప్తం అయిపోయాయి" రాష్ట్రంలో మందు తాగేవాళ్ళే ఎక్కువ ఉన్నారని పించింది. వీళ్ళవల్ల అన్ని చోట్ల రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.



ఆక్సీజన్ మించిన విలువ వైన్ సంతరించు కున్నట్లు అనిపించింది. ఇంత సొమ్మే మందుకు ఖర్చు పెట్టగలిగే ఈ ప్రజలకు వాక్సీన్లకు పరిమితమైన ధరలు వసూలు చెయ్యాలి అదీ నిర్మొహమాటంగా! పరిస్థితి చూస్తుంటే ఈ లాక్డౌన్ దాన్ని విధించిన విధానం కోవిడ్ నిబంధనలు పాటించని ఈ జనానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించక పోగా ఈ కోవిడ్ ప్రమాధాన్ని మరీ ఇబ్బడి ముబ్బడి గానే కాదు కొన్ని పదుల రెట్లు పెంచేసింది. 



అలాగే పండ్లు కూరగాయలు నిత్యావసరాలు ఇక దొరకవన్నట్లు అవసరాలకు మించి జనాలు కొనేశారు. ఈ దుకాణాల ముందు టోలీచౌకి రైతుబజారు క్రిక్కిరిసి పోయింది. అంతటా జనం గుంపులుగా చేరి జనసముద్రం తలపించింది. ఈ పరిస్థితి గమనిస్తే కరోనా వ్యాప్తికి క్రమశిక్షణ ఏమాత్రం పాటించని బాధ్యతా రాహిత్యం అన్నీచోట్ల కనిపిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాలు నియమ నిబంధనలు విడుదల చేసి అనుసరించని వారిని చట్ట ప్రకారం శిక్షలు విధించాలి. అదీ కఠినంగా అమలు పరచాలి. ఈ మాత్రం అమలు చేయలేని నాయకులు మనకవసరమా?



ఇలాంటి జనాలకు కుల విభజన చేసి రిజర్వేషన్ అమలు చేయటం {{RelevantDataTitle}}