సెంట్రల్ జైలునే ఆస్పత్రిగా మార్చండి.. కేసిఆర్ ఆదేశం?

praveen
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ లో ఇక ఇప్పుడు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. చూస్తూ చూస్తుండగానే వందల్లో ఉన్న కేసులు కాస్త వేల లోకి వెళ్లి పోయాయి.  అందరూ వైరస్ పై అవగాహన తో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండవరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిపై పంజా విసురితుంది.

 రెండో రకం కరోనా వైరస్ ప్రజలందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది నేపథ్యంలో ఎంతోమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యల కారణంగా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఆసుపత్రులలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరుణంలో ఇక అక్కడ సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో ఎవరికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

 వరంగల్ సెంట్రల్ జైలు ను యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా మార్చాలి అంటు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసారు.  కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రి సరిపోవడం లేదు ఈ నేపథ్యంలోనే ఇక 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐసీయూ ఆక్సిజన్ ప్లాంట్ క్రిటికల్ కేర్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ఇక జైలును వరంగల్ శివారు ప్రాంతాల్లో కి తరలించాలని..  ప్రాతిపదికన దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: