శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిటిడి బోర్డు కీలక నిర్ణయం..?
దీంతో శ్రీవారి భక్తులు అందరూ తీవ్ర ఆందోళన చెందారు. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా కేవలం కొంత మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యాన్ని కలిగిస్తు టిటిడి బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు పెరిగిపోతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల దర్శన టిక్కెట్లను కూడా ఎక్కువగా విడుదల చేసేందుకు టిటిడి బోర్డు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో భక్తుల తాకిడి మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు.
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్ లను ఇటీవలే ఉదయం ఎనిమిది గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఏకంగా 25 వేల టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది టిటిడి బోర్డు. ఇక వీటితో పాటు వచ్చే నెలకు సంబంధించి తిరుమల తిరుపతిలోని గదులు బుకింగ్ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.