దారుణం: కట్టుకున్న భర్తే స్నేహితుడితో భార్యను రేప్ చేయించాడు.. ఎక్కడంటే..!?

Suma Kallamadi
దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.  మానవ విలువలు మంటగలిగిపోతున్నాయి. కట్టుకున్న భార్యను మరో వ్యక్తితో అత్యాచారం చేయించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కిషన్ తన భార్య మమతతో కలిసి స్థానిక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కిషన్ తరచూ తన భార్యను హింసిస్తుండేవాడు. అదనపు కట్నం తెమ్మని వేధించేవాడు. పెళ్లి జరిగి రెండేళ్లు గడుస్తున్నాయి.
అయితే గత రెండేళ్లుగా తన భార్యకు ప్రత్యక్ష నరకం చూపించాడు. అంతేకాదు ఆమెను చిత్ర హింసలకు గురిచేసినప్పటికీ, మమత ఎవ్వరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసింది. ఇదిలా ఉంటే మమత తన పోషణ కోసం షాపింగ్ కాంప్లెక్సులో పనిచేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ షాపు యజమానితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కిషన్ తన భార్య మమతను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు.
మమత మాత్రం మౌనంగానే అతడి హింసలను భరించింది. అయితే తనకు షాపు యజమానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అయితే కిషన్ మాత్రం ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు. గత వారం ఫుల్లుగా మద్యం సేవించి, తన స్నేహితుడు జోసెఫ్ ను ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, తన భార్య మమత మోసం చేసిందని, అతడికి చెప్పి వాపోయాడు. అంతేకాదు ఆమెకు బుద్ధి చెప్పాలంటే అత్యాచారం చేయాలని ప్రోత్సహించాడు.
ఇక దీంతో మృగంలా మారిన జోసెఫ్ కామంతో కళ్లు మూసుకొని పోయి మమతపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమెను తీవ్రంగా హింసించాడు. దీంతో మమత అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: