కామంతో ఊగిపోయిన వాలంటీర్.. బాలిక ఒంటరిగా ఉండడంతో.. చివరికి..?
అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి ఇక మహిళల పై అత్యాచారాలకు పాల్పడే కీచకులకు కఠిన శిక్షలు విధించేందుకు కఠిన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కామం తో ఊగిపోయి అభం శుభం తెలియని ఆడపిల్లలపై దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఏకంగా ఒక బాలిక పై కన్నేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవంతం గా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు లో చోటు చేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు పని నిమిత్తం పొలానికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గ్రామ వాలంటీర్ గమనించాడు. ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ రమేష్ కామం తో ఊగిపోయాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏకంగా ఇంట్లోకి వెళ్లి బాలికను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.