లైవ్‌లో చెప్పుతో కొడతావా.. నిన్ను శాశ్వతంగా బహిష్కరిస్తున్నా..పో..!

Chakravarthi Kalyan
చాలా రోజుల తర్వాత తెలుగు టీవీ ఛానళ్ల డిబేట్లో ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ ఛానల్ లో చర్చకు వచ్చిన ఇద్దరు గెస్టులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఓ గెస్టు మరో గెస్టుపై ఏకంగా చెప్పు విసిరాడు.. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. క్షణాల్లో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ నిర్వహించిన చ‌ర్చా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ విష్ణువ‌ర్ధన్ రెడ్డిని లైవ్‌లోనే చెప్పుతో కొట్టేసారు.
ఏపీ ప్రభుత్వ తాజా కేబినెట్ మీటింగ్ లో అమరావతి గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి డిబేట్‌లో చర్చ ప్రారంభించారు. ఈ నిర్ణయాల్లో రాజ‌ధాని నిర్మాణాల‌ను కొన‌సాగించాల‌నేది కూడా ఒక‌టి.  ఈ డిబేట్‌కు బీజేపీ నేత‌.. విష్ణువ‌ర్ధన్ రెడ్డి, ఏపీ ప‌రిర‌క్షణ స‌మితి అధ్యక్షుడు కొటిక‌లపూడి శ్రీనివాస్ ఇంకా మరికొందరు గెస్టులు హాజరయ్యారు. విష్ణువర్థన్ రెడ్డి, కొటిక‌లపూడి శ్రీనివాస్ ఇద్దరూ యాంకర్ వెంకటకృష్ణతో పాటే స్టూడియోలో ఉన్నారు. రాజ‌ధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేద‌ని కొటిక‌లపూడి విమ‌ర్శించారు. దీనికి విష్ణువ‌ర్ధన్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.
ఈ సమయంలో నువ్వు టీడీపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నావు. ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో అంటూ.. విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ సంయ‌మ‌నం కోల్పోయి.. కాలి చెప్పుతో ప‌క్కనే కూర్చున్న విష్ణువ‌ర్ధన్‌ రెడ్డిని కొట్టబోయారు. చెప్పును బలంగా విష్ణువర్థన్ రెడ్డిపై విసిరారు. విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి కుడి భుజానికి చెప్పు త‌గిలి కింద‌ప‌డింది.
ఈ హఠాత్మరిణామంతో షాకైన యాంకర్ వెంకట కృష్ణ వెంటనే డిస్కషన్‌లో బ్రేక్‌ చెప్పేశారు. ఆ బ్రేక్ సమయంలోనే కొటికలపూడి శ్రీనివాస్‌ ను డిస్కషన్ నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామంపై వెంకటకృష్ణ విష్ణువర్థన్ రెడ్డికి సారీ చెప్పారు. అంతే కాదు.. ఇకపై తన డిష్కషన్లకు కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ ను జీవితంలో పిలవనని శపథం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: