భర్తకు విషం ఇచ్చిన గర్భవతి భార్య.. కారణం తెలిసి షాకైన పోలీసులు..?

praveen
భార్య భర్తల బంధం అన్న తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్య భర్తల బంధం అంటే మనస్పర్థలకు కలహాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  ఈ మధ్యకాలంలో భార్య భర్తల బంధం లో ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక భార్య భర్తలు తరచుగా గొడవలు పడుతూ ఉండటం ఏకంగా  మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం లాంటి ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  అంతేకాదు పెళ్లి జరిగేటప్పుడు కష్ట సుఖాల్లో తోడు ఉంటామంటూ వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన వారే చివరికి.. కట్టుకున్న వారి విషయంలో యమకింకరులు గా మారిపోతున్న ఘటనలు కూడా కోకొల్లలు.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చింది భార్య. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంతో ఎంతోమంది కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన సంఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రియుడి మోజులో పడి ఏకంగా కట్టుకున్న భర్త అడ్డు తొలగించుకుంటున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన  ఘటన మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.  శారీరక సుఖం కావాలిఅంటూ భార్యను వేధించడం మొదలు పెట్టిన భర్త తీరుతో విసిగి పోయిన భార్య చివరికి భర్త ను  హతమార్చాలని అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అన్నంలో విషం కలిపి భర్తను హతమార్చింది.


 ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. అందియూర్  నందన్  కుమార్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితేప్రస్తుతం నందన్  కుమార్ భార్య గర్భవతి. ఇకపోతే ఇటీవలే విషాహారం తిని తీవ్రమైన కడుపునొప్పి విరేచనాలతో బాధపడినా నందన్  కుమార్ వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు నందన్  కుమార్. అయితే విషప్రయోగం కారణంగానే నందన్  కుమార్ మరణించాడు అని తేల్చారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. గర్భంతో ఉన్నప్పుడు తరచు కోరిక తీర్చాలి అంటు  వేధించేవాడని అందుకే అన్నంలో విషం కలిపి భర్తను హత్య చేశా అంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించింది భార్య మైథిలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: