మరోసారి రెచ్చిపోయిన చైనా.. స్ట్రాంగ్ వార్నింగ్.. బైడెన్ ఏం చేస్తారో..?

praveen
ప్రజాస్వామ్యం, హక్కులు అనేటువంటి వాటికి ఎలాంటి విలువ ఇవ్వకుండా.. నియంతృత్వం అనేటువంటిది  తమ సొత్తుగా భావిస్తూ.. ప్రపంచ దేశాలకు కల్లబొల్లి మాటలు చెబుతూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తూ ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చేయాల్సిన తప్పులు అన్నీ కూడా చేస్తూ.. తొక్కల్సిన అడ్డదారిలు  అన్ని తొక్కేస్తు చివరికి తామే గొప్ప అని చెప్పుకునేందుకు వెనకడుగు వేయదు చైనా. అదే సమయంలో ఇక ప్రపంచ దేశాలకు నీతివాక్యాలు వల్లిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ విస్తరణ వాద ధోరణితో ఎవ్వరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలా అని  ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలో ఇప్పటికే టిబెట్ దేశాన్ని చైనాలో ఒక భాగంగా మార్చుకుంది చైనా. ఇక అదే సమయంలో చైనకు  సరిహద్దుల్లో ఉన్న తైవన్  దేశాన్ని కూడా తమ దేశంలో కలుపుకోవడానికి చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తైవాన్  చిన్న దేశం అయినప్పటికి కూడా ఎప్పుడూ చైనాలో కలవడానికి ఆసక్తి చూపలేదు. ఇక అదే సమయంలో ఎప్పటికప్పుడు తైవాన్ చైనా దేశంలో ఒక భాగం అంటూ చైనా ఎప్పటికప్పుడు వాదన  వినిపిస్తూనే ఉంది. కానీ తైవాన్  మాత్రం చైనా వాదనను ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది.



 ఇక ఇటీవలే చైనా లో భాగమే తైవాన్ అంటూ చైనా వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవలే తైవాన్ కు  ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది చైనా. తైవాన్ ఒకవేళ స్వాతంత్రం అనే పేరు ఎత్తితే మాత్రం నాశనం చేస్తాం అంటూ చైనా వార్నింగ్ ఇచ్చింది అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ లో ప్రస్తుతం ప్రజలు ఎన్నుకోబడిన నాయకులే పాలనను కొనసాగిస్తున్నారని ప్రజాస్వామ్యబద్ధంగా తైవాన్  ముందుకు సాగుతుందని అలాంటి తైవాన్  ను నాశనం చేస్తామనడం దారుణం  అని అంటున్నారు విశ్లేషకులు. అయితే గతంలో తైవాన్  విషయం లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అండగా నిలవగా ప్రస్తుతం జో బైడెన్  ఎలా వ్యవహరించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: