ఆవుపేడతో పెయింట్ ! త్వరలోనే మార్కెట్ లోకి ?
ఇక ఈ పెయింట్ గురించి చెప్పుకుంటే, డిస్టెంబర్, ఎమల్షన్ రకాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ పెయింట్ వేసిన నాలుగు గంటల్లోనే అది ఆరిపోతుంది. పూర్తిగా పర్యావరణ రహితమైన ఈ పెయింట్ ద్వారా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుందని, చెప్పుకోవడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా, ఈ పేడ పెయింట్ కుమారప్ప నేషనల్ అండ్ మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్ గత కొన్నేళ్లుగా రూపొందిస్తుందని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం గోసంరక్షణ పేరుతో ఎన్నో రకాలుగా వాటిని పెంచి పోషించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది.
ఇప్పుడు పర్యావరణ హితమైన ఈ పేడ పెయింట్ ను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల ఎక్కువగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు జనాలు మొగ్గు చూపుతున్న తరుణంలో, ఈ వేదిక్ పెయింట్ ఆదరణ పొందే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.