మద్యం మత్తులో వచ్చిన మరిది.. అలా చేయడంతో వదిన ప్రాణం పోయింది..?

praveen
ఈ మధ్య కాలం లో క్షణికావేశం లో జరుగుతున్న దారుణ ఘటనలు  ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యానికి బానిసలు గా మారుతున్నారు ఎంతోమంది ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది మద్యం మత్తులో ఏకంగా ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణం గా అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే మరి కొంతమంది మద్యం మత్తులో ఏకంగా ప్రాణాలను సైతం తీసేస్తున్న ఘటనలు రోజురోజుకీ మీదికి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మద్యం మత్తు ఏకంగా ఒకరి ప్రాణం తీసింది.



 మద్యం మత్తులో మరిది ఏకంగా  వదిన ను దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం సృష్టించింది ఈ ఘటన. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మద్యం మత్తులో వచ్చిన మరిది  ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఇనుప రాడ్ తో  వదిన పై దాడి చేయడంతో చివరికి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వివరాల్లోకి వెళితే సత్తెనపల్లి మండలం పాకాల పాడు గ్రామం లో... రాణి అనే 35 ఏళ్ల మహిళ నివసిస్తుంది.  ఒక ఇటీవలె మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మరిది తో రాణి గొడవ పడింది.



 అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తికి  రాణి కి మధ్య గొడవ జరిగి మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిపోయిన సదరు వ్యక్తి పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తో వదిన పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే తీవ్రగాయాల పాలైన రాణి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.  ఇక స్థానికుల పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: