గ్రేటర్ యుద్ధం : అంచనాలు తారుమారు.. సీన్ రివర్స్..?

praveen
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం కూడా నిర్వహించారు. ఆయా పార్టీల పెద్దలు కూడా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేపట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి  అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే అందరూ టిఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకున్నారు కానీ అసలు ఫలితాలు వెలువడిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం పూర్తిగా తలకిందులు అయిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేయాలి అనుకున్న బీజేపీకి జిహెచ్ఎంసి ఎన్నికల రూపంలో ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ పెద్దలతో పాటు అటు ఢిల్లీ పెద్దలు కూడా గల్లీ ఎన్నికల కోసం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడం బిజెపికి ఎంతగానో కలిసి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది.



 ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయిపోయాయి.  గ్రేటర్లో ఓటర్ల నాడిని  పట్టడంలో సర్వేలన్నీ పూర్తిగా విఫలం అయి పోయాయి.  ఏ ఒక్క సంస్థ కూడా వెల్లడించిన అంచనాలు నిజమైన ఫలితాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నింటినీ తారుమారు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కేవలం 55 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా అనూహ్యంగా ఊహించని విధంగా బిజెపి నలభై ఎనిమిది స్థానాలలో విజయం సాధించడం సంచలనంగా మారిపోయింది.  దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: